22, అక్టోబర్ 2021, శుక్రవారం

పసుపు తో పాల వంటి చర్మం మీ సొంతం

 పసుపు తో పాల వంటి చర్మం మీ సొంతం


చాలా మంది యువతులు మరియు యువకులు తమ చర్మం మెరిసి పోవాలని చాలాప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే రకరకాల క్రీమ్స్ ను వాడతారు.


క్రీమ్స్ ను వాడటం తప్పు కాదు. కానీరోజు వాడటం వలన మీ చర్మం దెబ్బ తినవచ్చు. ఎప్పుడైనా పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో ఏమన్నా శుభ కార్యాలు ఉన్నప్పుడు క్రీమ్స్ ను  లేదా మేకప్ ను వాడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


 ఎప్పుడూ కూడా మేకప్ ను లేదా క్రీమ్స్ ను వాడటం వలన మొహం పైన ఉండే రంద్రాలు మూసుకు పోవచ్చు అని అంటున్నారు.మొహం పైన ఉండే రంధ్రాలు మూసుకుపోవడం వలన మన మొహం పైన ఉండే చర్మం చాలా దెబ్బతింటుంది.


 మరీ ముఖ్యంగా మేకప్ వేయడం వలన మొహం పైన ఉండే చర్మంకి చెమట పట్టదు. చెమట  ఎందుకు పట్టదు అంటే, కాస్మోటిక్స్ వాడటం వలన మన చర్మం పైన ఉండే స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి.


 స్వేద రంధ్రాలు మూసుకుపోవడం వలన మనకు చెమట పట్టదు. చెమట పట్టకపోవడం వలన మన శరీరం లోపల నుండి బయటకి వచ్చే కొన్ని కొన్ని వ్యర్ధాలు శరీరం నుండి బయటకి రాకుండా శరీరం లోపలి ఉండిపోతాయి.


 మన శరీరంలో నుండి వ్యర్థాలు బయటకు రాకపోవడం వలన ఆ వ్యర్ధాలు లోపలే ఉండిపోతాయి.వ్యర్థలు లోపలే ఉండిపోయే మన మొహం పైన లేదా మన వీపు పైన లేక ఇతర భాగాలలో మొటిమలు రావడానికి కారణం అవుతాయి.


 ఇది మాత్రమే కాకుండా కాస్మెటిక్స్ వాడకం ఎక్కువగా ఉన్నట్లయితే మన మొహంపైన వేసుకున్న మేకప్ వలన మన శరీరం లోపల నుండ వ్యర్థలు బయటకు రాక పోవడమే కాకుండా మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్ బయటకి రాకపోగా మనకు దురదలను మరియు చర్మం దద్దుర్లు రావడానికి కారణమవుతుంది.


 మేకప్ పౌడర్ లను ఎక్కువగా వేసుకోవడం వలన మన చర్మం పైన ఉండే మాయిశ్చరైజింగ్ కణాలు విడుదల చేసే మాయిశ్చరైజర్ ను ఫీల్చేసుకుంటాయి.

 


నుమాయిశ్చరైజర్ ను ఫీల్చేసుకోవడం వలన మన చర్మం పైన  తడి ఆరిపోయి మన చర్మం డీహైడ్రేట్ కు గురవుతుంది.చర్మం డీహైడ్రేషన్ కు గురి కావడం వలన చర్మంపైన పగుళ్లు రావడం మొదలవుతుంది.



 కాస్మటిక్స్ ఎక్కువగా వాడటం వలన మన కళ్ళ మరియు  కళ్ళ కింద ఉండే ప్రాంతం ఎంతగానో  దెబ్బతింటుంది. కళ్ల కింద ఉండే మెలనోసిన్ కాస్మోటిక్స్ ఎక్కువగా వాడటం వలన మరింత నల్లధనం వచ్చేలా చేస్తుంది.


 ఇది మాత్రమే కాకుండా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడితే మన కళ్ళు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రకరకాల వ్యాధులు మన కళ్ళకు వస్తాయి.


 కాస్మోటిక్స్ ఎక్కువగా వాడడం వలన మన చర్మం తన చర్మ కాంతిని పోగొట్టుకోవచ్చు. మన శరీరం రంగు మారిపోవడమే కాకుండా అక్కడ అక్కడ నల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి,అని డాక్టర్లు అంటున్నారు.


 నాచురల్ గా మొహాన్ని అందంగా మార్చుకోవడం ఎలాగో డాక్టర్లు చెప్తున్నా  చిట్కాలలో మనం కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


 మొదటి చిట్కా:


 కావలసిన పదార్థాలు:


 1. పసుపు

 2. నిమ్మరసం 

 3. పాలు


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా రెండు స్పూన్లు పసుపును తీసుకుని, దానిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు రెండు స్పూన్ల పాలని వేసి బాగా కలపండి.


 ఇలా కలిపిన మిశ్రమాన్ని మొహానికి రాసుకోండి.   ఇలా మొహానికి రాసుకుని  మిశ్రమాన్ని 20 నిమిషాల వరకు  ఉంచుకోండి. ఆ తరువాత మీ మొహాన్ని శుభ్రపరచుకోండి.


 ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయడం వలన మీ మొహం నేచురల్ గానే అందంగా మరియు ఎంతో కాంతివంతంగా తయారవుతుందిఅని అనడంలో సందేహం లేదు.


 ప్రయోజనాలు:


 పసుపు  మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. మన చర్మం రంగు రావడానికి మరియు మొహం పైన ఉన్న మచ్చలు పోవడానికి మొహం ఎప్పుడూ కూడా మెరిసే ఎలా ఉండడానికి సహాయపడుతుంది.


 నిమ్మరసం గురించి అందరికీ తెలుసు మన చర్మనికి సి విటమిన్ చాలా అవసరం. విటమిన్ సి అనేది మన చర్మం కాంతి రావడానికి సహాయపడుతుంది. మన మొహం పైన ఉన్న  డెడ్ స్కిన్ సెల్స్ ని పోగొట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది.


 ఇంకా పాల విషయానికి వస్తే పాలలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఒక్క సి విటమిన్ తప్ప. ఇది మన చర్మం హెల్దీ గా ఉండడానికి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా మన చర్మం స్మూత్ గా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి.


 రెండవ చిట్కా:


 కావలసిన పదార్థాలు:

 

 1. పెరుగు

 2. తేనె


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా రెండు స్పూన్ల పెరుగును తీసుకుని దానిలో రెండు స్పూన్ల తేనె ను కలపండి. అలా కలిపిన మిశ్రమాన్ని మీ మొహానికి రాసుకోండి.


 ఇలా రాసుకుని 15 నిమిషాలు నుండి 20 నిమిషాల వరకు ఉండండి. ఆ తర్వాత మీ మొహాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకోండి.



 ప్రయోజనాలు:


 పెరుగు మన మొహం పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ నిదానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇది మాత్రమే కాకుండా చల్లగా ఉన్న పెరుగుని మొహానికి రాసుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది నానమ్మ సందేహం లేదు.


 ఇంకా తేనే విషయానికొస్తే, తేనే చర్మంని కాంతివంతంగా చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీ చర్మానికి ముడతలు రాకుండా చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.


 ఇలా రోజూ చేసినట్లయితే మీ చర్మం కాంతి వంతంగా ఉండడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.


మూడవ చిట్కా:


 కావలసిన పదార్ధాలు:

 

 1. పెసరపప్పు

 2. పసుపు

 3. తేనె

 4. పాలు


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా ఒక మిక్సీ గిన్నెలో పెసరపప్పు కొంచెం దానిలో కొంచెం పసుపు కొంచెం తేనే మరియు సరిపడినన్ని పాలు పోసి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.


 అలా మెత్తగా అయిన మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి. ఇలా మొహానికి రాసుకుని 30 నిమిషముల వరకు ఉంచుకోవాలి.


 30 నిమిషాల్లో పూర్తయ్యాక వెళ్లి మొహాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేయడం వలన మీ ముఖంలో కలిగే మార్పును మీరే గమనించవచ్చు.


 ప్రయోజనాలు:


 పెసరపప్పు మెత్తగా  ఎలా చేయడం వలన దానీలో  అక్కడ అక్కడ ఉండే చిన్న చిన్న ముక్కలు మంచి స్క్రాబ్ లాగా పనిచేస్తాయి.


 పసుపు గురించి మనం పైన మాట్లాడుకున్నాము. పసుపు మన ముఖ కాంతిని పెంచుతుంది మరియు మచ్చలను పోగొడుతుంది.


 తేనె గురించి కూడా మనం పైన చర్చించుకున్నాము. తేనే మన చర్మం ముడతలు పడకుండా ఉండడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా తేనే  డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.


 తేనె కూడా మన చర్మం కాంతి రావడానికి ఎంతగానో సహాయపడుతుంది. చర్మం ఎప్పుడూ కూడా డీహైడ్రేట్ అవకుండా ఉండడానికి కూడా తేనే తోడ్పడుతుంది.


 పాల విషయానికి వస్తే, పాల గురించి కూడా మనం పైన మాట్లాడుకున్నాము. పాలు మన చర్మం మృదువుగా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి.


 నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్ల చెప్తున్నావే.


 నేను చెప్పిన దానిలో మీకు తెలియనిది ఏమైనా తెలుసుకున్నట్లు అయితే కామెంట్ చేయండి.


 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 ధన్యవాదములు.







లేబుళ్లు: , , , ,

1 కామెంట్‌లు:

22 అక్టోబర్, 2021 6:22 AMకి వద్ద, Blogger Unknown చెప్పారు...

Nice

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్