6, అక్టోబర్ 2021, బుధవారం

మీ చర్మంను మరియు మీ జుట్టును కాపాడుకోవడంలో అరటి చేసే మేలు

 మీ చర్మంను మరియు    మీ

జుట్టును కాపాడుకోవడంలో

 అరటి చేసే మేలు



చాలా మంది జీవితంలో అరటి పండును తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. అరటి పండులో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు మా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

 అరటి పండులో ఉండే పోషక విలువలు మన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మన చర్మాన్ని కాంతివంతంగా చేయడంలోనూ ఎంతో సహాయపడుతుంది.అరటి పండు గురించిఎంత తీసుకున్న తక్కువే.

 అరటిపండు వల్ల నే కాకుండాఅరటి తొక్క వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 అరటిపండు ప్యాక్ వేసుకోవడం వలన మీ ముఖము ఎంతగానో కాంతివంతంగా తయారవుతుంది. అరటి పండులో విటమిన్ ఏ ఉండటం వలన అది మీ చర్మాన్ని మరింతగా రక్షిస్తుంది.

 ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా మన చర్మం యొక్క సాగే గుణాన్నిమెరుగు పరుస్తుంది.ఇది మాత్రమే కాకుండా సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల వలన మన చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

 అరటి పండు వలన ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి,అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 అరటిపండు ప్యాక్ వేసుకోవడం వలన మన చర్మంముడతలు పడకుండా కాపాడుతుంది.అరటిలో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్లు మీ మాడుని తేమ  గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

 ఇలా తేమ గా ఉండడం వలన మీ జుట్టు ఎంతో ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంటుంది.

 మీ జుట్టు మరియు మీ చర్మం కి సంబంధించిన అనేక రకాల సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 అరటి పండు తో చేసే ప్యాక్ లు వేసుకోవడం వలన మీ చర్మాన్ని ముడతలు పడకుండా మరియు మొటిమలను తగ్గించుకోవడం లో కూడా సహాయపడుతుంది.మీ జుట్టు చివర ఏర్పడిన పగుళ్ల నుండి మరియు అనేక రకాల జుట్టు సమస్యల నుండి రక్షిస్తుంది.

 మెరిసే చర్మం కోసం:

 అరటి తో చేసే ప్యాక్ లు వేసుకోవడం వలన మీ చర్మం ముడతలు పడకుండా మరియు మచ్చలను నుండి విముక్తి పొందడానికిమరియు డార్క్ స్పాట్స్ పోవడానికి కూడా సహాయపడుతుంది.

 కావలసిన పదార్థాలు:

 1.  అరటి పండు

 2. ఒక టీ స్పూన్ తేనె

 తయారీ విధానం:

 అరటి పండు ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిమిక్సీలో వేసి మిశ్రమం గా చేయాలి.ఇలా తయారైన మిశ్రమంలో  ఒక టీ స్పూన్ తేనెను వేసి మొత్తం కలిసేలాబాగా కలపాలి.

 ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు విడిచిపెట్టాలి.ఇలా చేయడం వలన మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోవడంలో మరియు ముడతలు రాకుండా ఉండడంలో మరియు మచ్చలను పోగొట్టడంలో ఎంతో పాత్ర వహిస్తుంది.

 పదిహేను నిమిషములు పూర్తయిన తరువాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.ఇలా చేయడం వలన మీ ముఖము ఎంతో కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

 మొటిమలను నిర్మూలించడంలో అరటి యొక్క పాత్ర:

 కావలసిన పదార్థాలు:

 1.  అరటి పండు 1

 2. ఒక టీ స్పూన్ నిమ్మరసం

 3. ఒక టీ స్పూన్ తేనె

 తయారు చేసే విధానం:

 ముందుగా అరటిపండుని ముక్కలుగా చేసి ఒక మిశ్రమంలాతయారు చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని మరియు ఒక టీస్పూన్ తేనే వేసి బాగా కలపాలి.

 ఇలా కలిపిన మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకునే 30 నిమిషముల వరకు ఆరానివ్వాలి.ఆ తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుగుకోవాలి.

 మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ ను వారానికి కనీసం రెండు సార్లయినా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన మీ ముఖంలో మార్పులు కనిపిస్తాయి.

 పొడిబారిన చర్మం నుండి రక్షణ పొందడానికి:

 అరటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వలన మీరుఎంతో ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

కావలిసిన పదార్ధములు :

 1. సగం అరటి పండు

 2. ఒక టీస్పూన్ ఓట్మెల్

 3. ఒక టీ స్పూన్ తేనె

 4. ఒక టీస్పూన్ గుడ్డు లోని పచ్చసొన

 తయారు చేసుకునే విధానం:

 ముందుగా అరటిపండుని మెత్తని మిశ్రమంలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓట్మెల్ శుభ్రం చేసుకుని మెత్తని పొడి ఎలాతీసుకుని పక్కన పెట్టుకోవాలి.

 ఇప్పుడు పక్కన పెట్టుకున్న అరటి మిశ్రమంలో మనం తయారుచేసుకున్న పొడినే వేసి బాగాకలుపుకోవాలి.మనం తయారుచేసుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు ఒక టీ స్పూన్ తేనెను మరియు ఒక టీస్పూన్గుడ్డులోని పచ్చసొనను వేసి బాగా కలుపుకోవాలి.

 ఇలా తయారుచేసిన మిశ్రమంను మీ ముఖానికి నేరుగా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా క ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి.

 15 నిమిషాములు పూర్తయిన తర్వాతమీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత మీ ముఖాన్నిబాగా ఆరనివ్వాలి.

 మెరుగైన ఫలితాల కోసం ఈ చిట్కా ను వారంలో కనీసం రెండు సార్లు వేసుకోవచ్చు.

 దృఢమైన కేశాల కోసం:

 కావలసిన పదార్థాలు:

 1.  ఒకటి నుండి రెండు అరటి పండ్లు( బాగా ముగ్గిన వి)

 2. ఒక టేబుల్ స్పూన్ తేనె.

 తయారు చేసుకునే విధానం:

 అరటి పండ్ల గుజ్జును సేకరించాలి. ఇలా సేకరించిన గుజ్జులో ఒక టేబుల్ స్పున్ తేనె వేసి బాగా కలుపుకోవాలి.

 నా కలుపుకున్న మిశ్రమంను మీ కేశాలకు రాసుకునే 30 నిమిషముల వరకు వదిలేయాలి. 30 నిమిషాలు పూర్తయిన తర్వాత తల స్నానం చేయాలి.

 మెరుగైన ఫలితాలను పొందడానికి ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వలన వచ్చిన ఫలితాలను మీరు చూడవచ్చు.

 జుట్టు చిగుళ్ల పగుళ్ళ నుండి విముక్తిని పొందడానికి:

 అరటి పండులో ఉండే విటమిన్స్ A,C,E ఇవి మాత్రమే కాకుండా ఎన్నో రకాలైన మినరల్స్ ఉండడం వలన అరటిపండు మన మాడును తేమగా ఉంచడం మాత్రమే కాకుండా జుట్టు చివర్లకు ఏర్పడే పగుళ్ళ నుండి గూడా మన కేశాలకు రక్షణ ఇస్తుంది.

 కావలసిన పదార్థాలు:

 1.  బాగా ముగ్గిన అరటి పండు 1

 2. 2టేబుల్ స్పూన్ల పెరుగు

 3. రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

 తయారు చేసుకునే విధానం:

 అరటి పండ్ల నుండి అరటి గుజ్జును సేకరించాలి.ఇలా సేకరించిన గుజ్జును ఒక చిక్కని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

 ఈ చిక్కని మిశ్రమం లో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలిపి ఒక మిశ్రమం లా తయారు చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ తలకు రాసుకోవాలి. ఒక గంట పాటు మీ జుట్టును వదిలేయండి.

 షవర్ క్యాప్ ఉపయోగించి మీ జుట్టును గంటపాటు ఆరనివ్వాలి.ఆరిన తర్వాత మీ షాంపుతో తల స్నానం చేయండి.

 ఈ చిట్కా నీ వారంలో ఒకసారి పాటించడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

మీకు ఏమైనా సందేహాలు వున్నా యెడల కామెంట్ రూపం లో అడగగలరు. మరియు మీకు నాకు ఎమన్నా చెప్పాలి అనుకున్న కామెంట్స్ రూపం లో చెప్పగలరు.

ధన్యవాదములు.


లేబుళ్లు: , , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్